సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ బాంబు పెట్టినట్టు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్

by Disha Web Desk 12 |
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ బాంబు పెట్టినట్టు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లో నిత్యం రద్ధీగా ఉండే ఆల్ఫా హోటల్ లో బాంబు పెట్టినట్టు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఆల్ఫా హోటల్ బాంబు పెట్టినట్టు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆ హోటల్ మొత్తాన్ని క్షున్నంగా తనిఖీ చేశారు. కానీ అక్కడ ఎలాంటి బాంబు దొరక్కపోవడంతో పోలీసులు తమకు వచ్చింది ఫేక్ కాల్‌గా నిర్ధారించుకున్నారు. దీంతో ఫేక్ కాల్ చేసిన నెంబర్‌న్ ట్రేస్ చేశారు. నిందితుడు గౌస్ పాషాను ఖమ్మంలో మోండా మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story